ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : శాతవాహన యూనివర్సిటీ లో చదు వుతున్న గంటా కిరణ్మయి రెండవ సారి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ గా నియమితులయ్యారు. గతంలో ఈమె భూ పాలపల్లి నగర కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం వచ్చింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44 వ రాష్ట్ర మహాసభ లు జనవరి 3,4,5 తేదీ లలో శంషాబాద్ కేంద్రంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థి పరిషత్ కార్య కర్తలు పాల్గొని రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల పైన చర్చించి తీర్మానాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు రావు ల కృష్ణ నూతన రాష్ట్ర కార్యవర్గన్నీ ఎన్నుకున్నారు. తన నియామకానికి సహకరించిన కరీంనగర్ విభాగ్ పెద్దలకు, తోటి కార్యకర్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. అనునిత్యం విద్యారంగ సమస్యల పరి ష్కారాన్నికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఆమె నియామకం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News