ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాల లో శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్ 19 పరుగు పందాల పోటీలు నిర్వహించినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్ 19 హెచ్.జి.ఎఫ్ కార్యదర్శి బి బాబు రావు తెలిపారు. గురుకుల ప్రిన్సిపాల్ సిహెచ్. మంగ పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పరుగు పందాలలో గెలుపు, ఓటమిని ఒకే విధంగా చూడాలని క్రీడాకారులకు సూచించారు. రాష్ట్రస్థాయి పోటీలలో పథకాలు సాధించాలని సూచించారు. ఎంపిక పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్ సి ఓ షేర్ శ్రీధర్ అభినందించారు. జోనల్ స్థాయి పోటీలలో వ్యాయామ ఉపాధ్యాయులు నాంపల్లి, రాజేష్ రాజేందర్, రాజన్న, వామన్సోనియా సునీత, శ్రీదేవీ, క్రీడాకారులు పాల్గొన్నారు
Admin
E Nivas News