ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జాతీయ, రాష్ట్ర బీ సీ సంఘాల పిలుపు మేరకు సోమవారం జన్నారం మండల బీసీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా జన్నారం మండల కేంద్రములో రాస్తా రోకో నిర్వహించారు . ఈ సందర్భంగా బీ సీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కుల గణన చేపట్టడమూ అసెంబ్లీలో బీ సీ బిల్లు ప్రవేశపెట్టే ఆమోదించడమూ గవర్నర్ కి బిల్లును పంపించడం, చివరికి జీ ఓ నెంబర్ 9 నీ విడుదల చేశారన్నారు. ఈ విషయంగా రెడ్డి జాగృతి సంఘం తరఫున హైకోర్టులో కేసు వేయడం వలన స్టే విధించడం జరిగిందన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయినాయనీ స్టే వేకేట్ చేసి 42 శాతం బీ సీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడార్ల నరసయ్య, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ , జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్ , మాజీ ఎంపిటిసి రాగుల శంకర్ , ప్రధాన కార్యదర్శి సంద గోపాల్ , మామిడి విజయ్ , ముదిరాజ్ సంఘం మండల ఉపాధ్యక్షుడు ఐలవేణి రవి , మహేంద్ర సంఘం నాయకుడు పిల్లి మల్లయ్య, కోడి జుట్టు రాజయ్య , ఒడిపెల్లి రామన్న, ఒడిపెల్లి రాజేష్ , ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్ర పురుషోత్తం, పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న , మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ , మున్నూరు కాపు సంఘం పొనకల్ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ముంజంపెల్లి సాయి, కనికరపు గంగాధర్, గడ్డం సత్తయ్య, ఈర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News