Monday, 14 September 2026 01:06:28 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

జగిత్యాల లో విద్యుత్ ఉద్యోగుల నిరసన

Date : 10 March 2026 10:18 PM Views : 228

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2025 కు వ్యతిరేకంగా జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు టీజీపీ ఈ జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా విద్యుత్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు.ఈ నిరసన లొ భాగంగా జేయేసి నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపి వేయాలని, ప్రైవేటీకరణ తొ ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు తీవ్రమయిన నష్టం తీరని అన్యాయం జరగడమే కాకుండ నిరుద్యోగులకి ప్రభుత్వ కొలువులు రావని చెప్పారు, అలాగే రైతులకి, సామాన్య ప్రజలకి, చిన్న- మధ్య తరగతి పరిశ్రమలకు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని సబ్సిడీలను క్రమ క్రమంగా ఎత్తి వేయాల్సి వస్తుందని, విద్యుత్ చార్జీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో పెరుగుతాయని అలాగే ప్రజల సొమ్ముతో కార్మికుల చెమటని చిందించి దశాబ్దాలుగా నిర్మించుకున్న వందలకోట్ల విలువైన లైన్స్ ని ప్రైవేట్ కంపెనీలకు నామ మాత్రపు చార్జీలకే ధారాదత్తం చేయవలసి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా స్టేట్ ఈ ఆర్ సి సభ్యులని తీసివేసే అధికారం పొందనుందని, దీనివలన రాష్ట్రాల హక్కులకు భంగం ఏర్పడుతుంది చెప్పారు. ఈ బిల్లు ద్వార ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలనుంచి విద్యుత్ ని అధిక ఛార్జీలకు కొనే దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ సవరణ బిల్ ని రద్దు చేసెంతవరకు వరకు మా నిరసనలు ఆగవని ఇంకా ఉదృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో ఎస్ ఈ. సుదర్శనం మరియు జేయేసి నాయకులు చేరాలు, అజీజ్ , రాంజీ నాయక్, , సతీష్, అశోక్ రెడ్డి, భూమయ్య, అభీద్, గార్లు, మరియు పలు సంఘాల నాయకులు, విద్యుత్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :