ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వరంగల్ జిల్లా హంటర్ రోడ్ లోని తాళ్ల పద్మావతి పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో నర్సంపేట విజ్ డమ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అన్ని విభాగాల్లో పాల్గొన్నారని శనివారం పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, సృజనాత్మక శక్తులను వెలికితీయుటకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన ఎగ్జిబిట్లను, ప్రదర్శించిన విద్యార్థులను, గైడ్ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సత్య శారద, ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి, డిఈఓ రంగయ్య నాయుడు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ మరియు ఇతర సైన్స్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జహంగీర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, గైడ్ టీచర్లు రఘుపతి రెడ్డి, శివరాజ్, కుమారస్వామి, రాజు, చాంద్ పాషా, మధు, హారిక, సుకన్య, రమ్య, అరుణ, ఆంజనేయులు పాల్గొన్నారు.
Admin
E Nivas News