ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జాతీయ ఆయుష్ పథకంలో భాగంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం ఆయుష్ శాఖ, వైద్య శిబిరం ఇంచార్జ్ డా. సిహెచ్. స్పందన శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఆయుష్ పథకం క్రింద ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత హోమియోపతి వైద్య శిబిరం, ఆరోగ్య అవగాహన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News