ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట సబ్ జైల్ లో మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత ఆదేశాల మేరకు ప్రత్యేకవైద్య నిపుణుల చేత ప్రత్యేక వైద్య శిభిరం నిర్వహించినట్లు వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక వైద్య శిభిరం లో కంటిపరీక్షలు , క్షయ వ్యాధి పరీక్షలతో పాటు షుగర్, బీపీ పరీక్షలు ,చెస్ట్ ఎక్స్ రే , హెచ్ ఐవి, హెపటైటిస్ బి పరీక్షలు నిర్వహించి మందులనుఅందజేశారు .ఈ సందర్భంగా ఖైదీలకు ఆరోగ్య విద్య, వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు మానవ జీవనశైలితో వచ్చే మార్పుల వలన కలిగే వ్యాదుల వలన మరియు వ్యక్తిత్వ వికాసం పై ఖైదీలకు అవగాహనకల్పించారు . ఈ వైద్య శిభిరం లొ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ప్రసాద్ , డాక్టర్ సుధాకర్ నాయక్ , వైద్యులు డాక్టర్ విద్య , డాక్టర్ వినోద్ , ఆప్తాల్మిక్ ఆఫీసర్ శంకర్, డెమో బుక్క వెంకటేశ్వర్లు, సీహెచ్ ఓ నాందేవ్, లింగారెడ్డి, హెచ్ ఓ లు లక్మణ్ స్వామి, దేవేందర్, ఐసీటీసీ కౌన్సిలర్ ఆంజనేయులు, టీబీ సూపర్ వైజర్ సురేష్, హెల్త్ సూపర్ వైజర్ శోభ, ల్యాబ్ టెక్నీషియన్ అజీజ్ ఖాన్, హెల్త్ అసిస్టెంట్లు గఫూర్ ఇసాక్ అహ్మద్ మరియు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Admin
E Nivas News