ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దళితుల ఆరాధ్యదైవం అయిన సవార్ లచ్చమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. మరిపెడ మండలంలోని ఆనేపురం గ్రామం లోని దళిత కాలనీలో సవార్ లచ్చమ్మ పండుగ వేడుకలకు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ హాజరయ్యారు. అక్కడ కాలనీ వాసులతో కలిసి సవార్ లచ్చమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మాట్లాడుతూ.. సవార్ లచ్చమ్మ పండుగను కాలనీ వాసులందరు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం దళితులకు అండుగా ఉంటు వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముందుగా దళితులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండో దశలో మంజూరు అయ్యే ఇందిరమ్మ ఇళ్లను ముందుగా దళిత లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. సవార్ లచ్చమ్మ ఆలయ అభివృద్ధికి తన వంత సహకారం అందించనున్నట్లు ఎమ్మెల్యే రామచంద్రునాయక్ హామీ ఇచ్చారు. సర్పంచ్ మల్లికంటి వసుపతి యాకన్న,మాజీ ఎంపీటీసీ మంద రమ్యరవి, మాజీ సర్పంచ్ దామెర్ల వీరన్న,కమిటీ సభ్యులు ఎమ్మార్పీఎస్ నాయకులు మంద వెంకన్న,డాక్టర్ వెంకన్న,కొండ బక్కయ్య, చిత్రాల చంద్రయ్య,పోలెపాక గురువయ్య,బకర వెంకన్న, డ్రైవర్ వెంకన్న.దామెర్ల వెంకన్న.కొమిరె నాగన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News