ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డిసెంబర్ 9న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఆదివాసి పోరిగర్జన సభకు అనుమతి నివారణ కోరుతూ ఆదివాసీ నాయకులు మంగళవారం ఎస్పీని కలిశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పి గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ నిఖిత పంత్ నూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా మంగళవారంకలసి శాలువా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ఆదివాసి ప్రజల కేసులు విషయంలో పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని ఆదివాసి చట్టాలకు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించలని కోరారు.అనంతరం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ అధ్వర్యంలో వచ్చేనేల డిసెంబర్ 9 న జిల్లా కేంద్రములో ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు ఈ సభకు రాష్ట్రం అంతటా ఆదివాసి నాయకులు ప్రజలు పాల్గొననున్నారు. ఈ సభకు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చట్టబద్ధత లెని లంబడాలను తొలగించుట కొరకు ప్రధాన ఎజెండా పై ఆదివాసుల అస్తిత్వం కోసం హక్కుల కోసం పలు డిమాండ్ లపై ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వినతి పత్రం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ, జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావ్, జిల్లా కోశాధికారి ఎర్గటి సుధాకర్, వాంకిడి మండల అధ్యక్షులు మడవి భీంరావు, ప్రధాన కార్యదర్శి పంధ్రం సురేష్, ప్రచార కార్యదర్శి ధూర్వ భాను ప్రకాష్, నాయకులు సీడాం భీంరావ్, కోడప జగన్, మడవి యాదోరావు, మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News