ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే మేయర్ మునిసిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు చేస్తున్న ప్రచారాలతో పట్టణాలు మారు మ్రోగుతున్నాయి. కేవలం ఒకటే రోజు ప్రచార నిమిత్తం మిగిలి ఉండడంతో కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి ఇండిపెండెంట్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు వారిదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు రకాల హామీలు ఇస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధి చేసే నాయకులను ఆశీర్వదించాలని పోటీ చేస్తున్న అభ్యర్థులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటర్లను వేడుకుంటున్నారు. ప్రముఖ పార్టీల తరపున పోటీలు ఉన్న అభ్యర్థులు తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు తెలుపుతూ వారు ప్రచారం కొనసాగిస్తూనే మరోవైపు ఓటర్లకు మద్యంతో పాటు డబ్బులను కూడా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. స్వతంత్ర పార్టీ అభ్యర్థులు కూడా కనీసం ఒక్కసారైనా మాకు పట్టం కడితే మా సత్తా చూపిస్తామంటూ వారు కూడా తామేం తక్కువ లేదన్నట్లు ఓటర్లను కైవసం చేసుకునే రంగంలో దిగారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో పాటు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు అలాగే బీజేపీ ముఖ్య నాయకులు కూడా తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారాలు చేస్తూ హామీలు గుప్పిస్తున్నారు. ముఖ్య పార్టీలు తరఫున పోటీ చేసే అభ్యర్థులు వారి యొక్క కేంద్ర నాయకులు కూడా పిలిపించుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. నిత్యం కార్నర్ మీటింగ్ లో మంత్రులు ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చూపిస్తూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఏదిఏమైనా ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారు అన్న విషయం సర్వత్ర ఆలోచించాల్సి అవసరం లేకపోలేదు అన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.
Admin
E Nivas News