Wednesday, 29 July 2026 10:43:56 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

Date : 29 July 2026 09:34 PM Views : 8

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ శాఖ అధికారి ఇంటి బెడ్ రూమ్ లోనీ బీరువాలో దాచి ఉంచిన రూ. 26 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు అటవీశాఖ అధికారి కాగా, నిందితుడు మాజీ ప్రజా ప్రతినిధురాలి భర్త కావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ కు చెందిన అటవీశాఖ అధికారి గుడిమల్ల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా తీగల గుట్ట మణికేశ్వర నగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల స్వగ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని 26 లక్షలకు విక్రయించారు. ఆ నగదును తన అద్దె ఇంటిలో దాచిపెట్టగా, ఈ మధ్యలో ఆ డబ్బు అవసరం పడలేదు. గత నెల చివరి వారంలో డబ్బు అవసరం ఉండడంతో ఓ రోజు ఆ గదికి వెళ్లి చూడగా తాళం ధ్వంసం చేసి ఉంది. తీసుకొచ్చిన రూ 26 లక్షలు దొంగతనానికి గురయ్యాయి. తన ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకొని ఇంతకు ముందు ల్యాప్ టాప్ దొంగతనం చేసిన వ్యక్తే తన ఇంట్లోని నగదును దొంగతనం చేశాడని బాధితుడు నిర్ధారణకు వచ్చాడు. అదే విధంగా గత నెలలో తన ఇంటికి వచ్చి వెళ్లిన తన స్నేహితుడు దొంగతనం చేసినట్లు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు సదరు ఆ వ్యక్తి దొంగతనం చేసినట్లు నిర్ధారించి మంగళవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంకెవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటవీ క్షేత్ర అధికారి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: