Thursday, 30 July 2026 09:43:43 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం

Date : 30 July 2026 08:06 AM Views : 6

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సహచర ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై మధుసూదన్ దంపతులకు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆయన విద్యా సేవలను కొనియాడుతూ జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బిరుదు మధుసూదన్ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలను పెంపొందించడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు ప్రభుత్వ పాఠశాలలో సేవలందించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గురువుకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో మధుసూదన్ అందించిన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ తన సేవాకాలంలో సహకరించిన విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం విద్యార్థులతో అనుబంధాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు దుద్దిల శ్రీనుబాబు, మున్సిపల్ ఛైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సాహెందర్ రెడ్డి, ఎంఈఓ డి. లక్ష్మి, విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, మోహన్ శర్మ, ఉపాధ్యాయుల సంఘాల జిల్లా, మండల నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలతతో పాటు సహచర ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :