ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఎలక్ట్రానిక్ మీడియా మంథని డివిజన్ అధ్యక్షునిగా జంజర్ల శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళ వారం మంథనిలో డివిజన్ ఎలాక్ట్రానిక్ మీడియా 12 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జంజర్ల శంకర్ (HMTV), ఉపాధ్యాక్షులుగా యం డి ఖాన్ (NTV), ప్రధాన కార్యదర్శిగా కిరణ్ గౌడ్ (6TV), కార్యదర్శిగా బండ లక్ష్మీ నారాయణ (RTV), కోశాధికారిగా మాచిడి రాజేంద్ర ప్రసాద్ గౌడ్ (V6 News), సంయుక్త కార్యదర్శిగా మూగ శ్రీకాంత్ (T News), కార్యవర్గ సభ్యులుగా యం. శివ ప్రసాద్, చిట్లిమెల్ల. సంతోష్, రావికంటి. సతీష్ కూమార్, గౌరవ అధ్యక్షులుగా మేడగోని గోపాల్ గౌడ్, గౌరవ సలహాదారలుగా పినగాని. శ్రావణ్ కుమార్, మేడగోని. సత్యనారాయణ గౌడ్ లు ఎన్నికయ్యారు.
Admin
E Nivas News