ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో సిపి మాట్లాడుతూ,లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీ మార్గంలో పరిష్కారమవుతాయన్నారు. రాజీకి అనువైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన, కుటుంబపరమైన మరియు వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూలు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ లాంటి కేసుల్లో ఇరువర్గాలు లోక్ అదాలత్ ద్వారా చర్చించుకుని రాజీకి రావచ్చును అన్నారు. రాజీయే రాజమార్గం" అని చిన్న చిన్న తగాదాల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృధా చేసుకోవద్దన్నారు. జుడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశం ద్వారా ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు మరియు పోలీస్ సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇచ్చి, రాజీ పడదగిన కేసులను గుర్తించి,ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ సాధించే ప్రయత్నాలు చేయాలని కమిషనర్ సూచించారు. తమ కేసుల్లో రాజీ కావాలని కోరుకునే వ్యక్తులు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతినపరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్ గురించి ప్రజలకు సూచనలు ఇలా ఉన్నాయి అన్నారు. ఇరుపక్షాల సమ్మతితో మాత్రమే రాజీ సాధ్యమని లోక్ అదాలత్లో జరిగిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగాపరిగణించబడుతుం దన్నారు . ప్రతి కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సోషల్ వర్కర్స్ సమన్వయంతో పరిష్కారం జరుగుతుంది. ప్రజలు, పోలీస్లు, న్యాయస్థానాలు కలిసికట్టుగా పనిచేస్తే, చిన్న వివాదాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా ముందే పరిష్కరించవచ్చని సీపీ తెలిపారు.
Admin
E Nivas News