ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో పవిత్రమైన కార్తీక మాసంను పురస్కరించుకొని నెల రోజులపాటు భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు లోకే మనోహర్, లోకే శరత్ లు పేర్కొన్నారు. ఈ నెల 22 నుండి నవంబర్ 20 వరకు నిర్వహించనున్న భజన కార్యక్రమంలో స్థానిక అన్ని వాడలకు చెందిన భజన పరులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలో నెల రోజులు రాత్రి 7.30 గంటల నుండి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు లోకే మనోహర్, లోకే శరత్, భజన నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీరంభట్ల నరహరి, నల్లగొండ శ్రీనివాస్, అవధానుల శ్రీనివాస్, కొంజర్ల విష్ణుదాస్, ఆలయ అర్చకులు దాహగం రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Admin
E Nivas News