ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని నీలికుర్తి సర్పంచ్ తొట్టి గౌతం అన్నారు.వారు స్థానిక నాయకులతో కలిసి నీలికుర్తి గ్రామానికి వచ్చే ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కంపచెట్లు, చెత్త చేదారాన్ని, ముళ్ళపొదలను జేసిబి తో తొలగించడంతో పాటు గ్రామంలో పారిశుధ్య పనులను చేపట్టి పిచ్చి మొక్కలను, సైడ్ కాలువలోని మట్టిని తొలగించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌతం మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్ సహకారంతో నీలికుర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. నీలికుర్తి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించి, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని తెలిపారు. నీలికుర్తి గ్రామంలో తాగునీటి, వీధిలైట్లు, మురికి కాలువల శుభ్రత తదితర వంటి అంశాలపై మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. చెత్తా ను రోడ్డు పై వేయవద్దని, నీటిని వృధాగా వదలకుండా డమ్మీలను ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వినోద్, నాయకులు తొట్టి శ్రీను, పాక భిక్షం, శరత్, నరేష్, వెంకన్న, కరుణాకర్, యాదగిరి, సోమయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News