Monday, 02 March 2026 03:23:04 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం...

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి

Date : 01 March 2026 09:44 PM Views : 21

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వసంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి తెలిపారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాలుర సమీకృత వసతి గృహంపై వెలువడిన వార్తల నేపథ్యంలో ఆదివారం వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి భోజన సరఫరా, త్రాగునీరు, వసతి, వంటశాల ఏర్పాట్లను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి మాట్లాడుతూ వసతి గృహంపై వెలువడిన వార్తల నేపథ్యంలో వసతి గృహాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించడం జరిగిందని, హాస్టల్ స్థాయిలో పర్యవేక్షణ, సమన్వయంలో తాత్కాలిక లోపం కారణంగా భోజన సరఫరా, కొంతమంది ప్రాథమిక సౌకర్యాలలో అంతరాయం ఏర్పడినట్లు గమనించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టడం జరిగిందని, విద్యార్థులకు నిరంతర భోజన సరఫరా, శుద్ధమైన త్రాగునీరు, వసతి, వంటశాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వసతి గృహంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, సంబంధిత వసతి గృహ సంక్షేమ అధికారి, సిబ్బందిని కఠినంగా హెచ్చరించడం జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే బాధ్యులపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :