Friday, 11 September 2026 08:13:18 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

తీర్మానం ఒక చోట నిర్మాణం మరోచోట... ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సీసీ రోడ్లపై ఆరోపణలు...

Date : 06 September 2026 03:36 AM Views : 61

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం ఖాన్‌సాయిపేట గ్రామపంచాయతీ పరిధిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయి నెల రోజులు గడవకముందే పగుళ్లు బారడంతో పనుల నాణ్యతపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం ప్రకారం ఎస్సీ కాలనీ నుంచి పోచమ్మ గుడి, స్మశాన వాటిక వరకు సీసీ రోడ్డు నిర్మించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా అవసరం లేని ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టారని బిఆర్ఎస్‌ ఖాన్‌సాయిపేట గ్రామశాఖ అధ్యక్షుడు కుడుదుల వెంకటేష్‌ ఆరోపించారు. గ్రామపంచాయతీ కార్యాలయం, పాఠశాల ముందు ఇప్పటికే ఉన్న సీసీ రోడ్డుపైనే మళ్లీ సీసీ రోడ్డు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మాణ సమయంలో సంబంధిత ఇంజనీర్‌ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించలేదని, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే పనులు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని వెంకటేష్‌ తెలిపారు. పనుల నాణ్యత, అంచనాలు, ఉపయోగించిన మెటీరియల్‌, నిర్మాణ విధానంపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. నెల రోజులకే పగుళ్లు బారిన సీసీ రోడ్లను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కుడుదుల వెంకటేష్‌ ఒక ప్రకటనలో ఉన్నతాధికారులను కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :