Saturday, 13 June 2026 02:17:41 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

శ్రీకాళహస్తి దేవస్థానంలో భూపాలపల్లి కళావైభవం

తిరుపతి నాని శిష్యులకు 'జాతీయ నాట్య కళాభారతి' పురస్కారం!

Date : 21 November 2025 08:25 PM Views : 290

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో అమరావతిలో నిర్వహించిన సాంస్కృతిక వేడుకల్లో భూపాలపల్లి చిన్నారుల భరతనాట్య ప్రదర్శనతో మరింత శోభాయమానంగా మారాయి. మంథనికి చెందిన ప్రముఖ భరతనాట్య గురువు, భూపాలపల్లి గ్రామానికి చెందిన తుర్పాటి తిరుపతి నాని శిష్య బృందంతో కలిసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వారి ప్రదర్శించిన భరతనాట్యం వైభవం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనకు గురువు తిరుపతి నానిని వారి శిష్య బృందాన్ని జాతీయ నాట్య కళాభారతి పురస్కారంతో సత్కరించారు. శ్రీకాళహస్తి దేవస్థానం సూపరిండెంట్ మాధురి చేతుల మీదుగా, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బుచ్చి శ్వరరావు సమక్షంలో వారు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు భూపాలపల్లి చిన్నారుల ప్రతిభను, గురువు నాని ని అభినందించారు. "ఇలాంటి వేడుకలలో శాస్త్రీయ నాట్యానికి వేదిక కల్పించడం చాలా అభినందనీయం, ఆనందంగా ఉంది" అని పలువురు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారులకు శాస్త్రీయంగా నాట్యం నేర్పించి, ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై ప్రదర్శిస్తున్న నాని మాస్టర్ కృషిని, అంకితభావాన్ని వారు ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :