ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో అమరావతిలో నిర్వహించిన సాంస్కృతిక వేడుకల్లో భూపాలపల్లి చిన్నారుల భరతనాట్య ప్రదర్శనతో మరింత శోభాయమానంగా మారాయి. మంథనికి చెందిన ప్రముఖ భరతనాట్య గురువు, భూపాలపల్లి గ్రామానికి చెందిన తుర్పాటి తిరుపతి నాని శిష్య బృందంతో కలిసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వారి ప్రదర్శించిన భరతనాట్యం వైభవం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనకు గురువు తిరుపతి నానిని వారి శిష్య బృందాన్ని జాతీయ నాట్య కళాభారతి పురస్కారంతో సత్కరించారు. శ్రీకాళహస్తి దేవస్థానం సూపరిండెంట్ మాధురి చేతుల మీదుగా, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బుచ్చి శ్వరరావు సమక్షంలో వారు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు భూపాలపల్లి చిన్నారుల ప్రతిభను, గురువు నాని ని అభినందించారు. "ఇలాంటి వేడుకలలో శాస్త్రీయ నాట్యానికి వేదిక కల్పించడం చాలా అభినందనీయం, ఆనందంగా ఉంది" అని పలువురు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారులకు శాస్త్రీయంగా నాట్యం నేర్పించి, ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై ప్రదర్శిస్తున్న నాని మాస్టర్ కృషిని, అంకితభావాన్ని వారు ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.
Admin
E Nivas News