Thursday, 30 July 2026 04:12:47 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం..

ఆర్డీవో ఉమారాణి..

Date : 25 April 2026 05:30 AM Views : 166

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా గురు వారం మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడి చికిత్స పొందుతూప్రాణాలు కోల్పోయిన కోల శంకర్ గౌడ్,కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుం దనినర్సంపేట ఆర్డిఓ ఉమారాణి తెలిపారు. ఆయన మృతి ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆవేదన నింపిన నేపథ్యంలో ప్రభు త్వం తక్షణమే స్పందించి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు నర్సంపేట ఆర్డీ వో ఉమారాణి అధికారిక ప్రకటన చేశారు. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన ఆర్డీవో ఉమారాణి మృతుడి కుటుంబ సభ్యులను పరా మర్శించారు. ప్రభుత్వం తరఫున అందించే సహాయ సహకారాలను అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. కుటుంబంలో ఒకరికి ఉద్యో గం కల్పిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబం కావడంతో శంకర్ గౌడ్ కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన వ్యక్తిగతంగా మరో రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. కాగాగత 25 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్‌గా సేవలందించిన శంకర్‌కు భార్య హేమలత, కుమార్తె షామిలి, కుమారు డు హేమంత్ ఉన్నారు. భార్య హేమలత దివ్యాంగు రాలిగా తెలిసింది. సొంతిల్లు లేకపోవటంతో కూతురు స్వగ్రామం నర్సం పేట మండలం ముత్తోజి పేటకు తలించారు. అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శంకర్ గౌడ్‌కు నివాళి అర్పించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :