ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది. భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పును ప్రకటించారు. రూ.1 లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశిస్తూ భగీరథ్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు పరీక్షలు రాసేందుకు లోయర్ కోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ ఇవ్వగా గడువు ముగిసిన తర్వాత ఆయన జూన్ 25న తిరిగి జైలులో లొంగిపోయారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
Admin
E Nivas News