ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : గత నెల 18వ తేదీన జరిగిన కులదూరం హకారణ హత్య తలాండి శ్రావణి కుటుంబానికి న్యాయం జరగాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తీర్యాణి మండలంలోని భీంజీగూడ లో కరపత్రాల విడుదల చేశారు.కుల దురంకరణ హత్యకుగురి అయిన శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని దోషులను త్వరగా శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఐదెకరాల సాగు భూమి ఇవ్వాలని ఇలాంటి హత్యల్లో జరగకుండా చూడాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గేడం టికనంద్ కార్తీక్ డిమాండ్ చేశారు. నవంబర్ 22న చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. గత నెల 18వ తేదీన జరిగిన కుల దురంకారహత్య కు ఇప్పటివరకు కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఆదివాసులపై జరుగుతున్న దాడులను మహిళలపై జరుగుతున్న దాడులను కులదూరం కారణ హత్యలపై జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్రం గంగు, టేకం మారతి ఆత్రం బాలు,కోరంగ తరక్,గెడం రమేష్ తుమ్రా శ్యాం రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News