ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : నా ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతలే కారణమని మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షుడు ఏట మధుకర్ (45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధుకర్ నీలువాయి అటవీ ప్రాంతంలో శుక్రవారం చెట్టు కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కొందరు కాంగ్రెస్ పార్టీ నేతల కారణమంటూ మధుకర్ రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. వేమనపల్లి మండలంలో కుటిల రాజకీయాలు ఉన్నాయని తన క్యారెక్టర్ అలాంటిది కాదంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలో దుర్గం శివరాం ఇప్పుడు ఏట మధుకర్ ఇలా బలి కావాల్సిందేనా అగ్రవర్ణాల పాలకులకు బుద్ధి చెప్పే వారు లేరా...? అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు . కాంగ్రెస్ నేతలు ఎస్సై వల్లనే.. కాంగ్రెస్ నేతలు అక్రమ కేసులు బహించడంతో తీవ్రమణస్థాపానికి గురై ఏట మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అక్రమ కేసులు బనాయించి ఆత్మహత్యకు బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకు సహకరించి అక్రమ కేసులు నమోదు చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులను అరెస్టు చేసేంతవరకు మృతదేహాన్ని పోలీసులు ముట్టకూడదని వేమనపల్లి చెన్నూర్ ప్రధాన రహదారిపై మృతుడి కుటుంబ సభ్యులు బయటాయించి ఆందోళన చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు శవం చెట్టుకే ఉండడంతో పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Admin
E Nivas News