Wednesday, 29 July 2026 09:13:13 PM
# వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం..

సిద్ధిపేట లో గెలవడంఎవరికైనా అంత సులువు కాదు..

సీఎం రేవంత్ రెడ్డి

Date : 23 March 2026 09:44 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సిద్ధిపేటలో గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ నిన్న సిద్దిపేటలో ప్రకటించారు. సిద్దిపేట అంటే ఒకప్పుడు కేసీఆర్ కంచుకోట, కానీ గత రెండు దశాబ్దాలుగా అది తన్నీరు హరీష్ రావుకు పెట్టని కోట గా మారింది. అక్కడ రాజకీయం పార్టీల చుట్టూ కాకుండా హరీష్ రావు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఆయన ఏ గుర్తు మీద నిలబడినా, లేదా స్వతంత్రంగా పోటీ చేసినాభారీమెజారిటీతో గెలుస్తారన్నది జగమెరిగిన సత్యం. ఈ స్థాయి క్రెడిబిలిటీని ఆయన కేవలం మాటలతో కాకుండా, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేపట్టడం ద్వారా సంపాదించుకున్నారు. అక్కడ ప్రతి వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు ఎవరైనా గెలవాలంటే హరీష్ రావు ఆశీస్సులు ఉండాల్సిందే అనేంతగా ఆయన వ్యవస్థను నిర్మించుకున్నారు. పదవుల ఆశ చూపిన పలకని ఓటర్లు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఆశ చూపడం వెనుక బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాల్లో పట్టు సాధించాలనే పట్టుదల కనిపిస్తోంది. అయితే, సిద్దిపేట ప్రజల కోణంలో చూస్తే.. హరీష్ రావు గెలిచిన ప్రతిసారీ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆ నియోజకవర్గానికి ఒక మంత్రి ఉన్నట్లే లెక్క. హరీష్ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆయనకున్న ప్రభావం ముందు కొత్తగా వచ్చే అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఓటర్లను పెద్దగా ప్రభావితం చేసే అవకాశం లేదు. ఎందుకంటే, అక్కడ ఓటర్లకు కావాల్సింది పదవులు కాదు, తమ కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు నాయకత్వ లేమి కాంగ్రెస్‌కు అసలు సవాల్... సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బలమైన నాయకత్వం లేకపోవడం. హరీష్ రావు రాజకీయ చతురత వల్ల అక్కడ ఇతర పార్టీల నేతలు ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ ,బీజేపీ అక్కడ గెలవాలంటే పదవుల ప్రకటనలు చేస్తే సరిపోదు. హరీష్ రావు కంటే మిన్నగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గంలో సొంత క్యాడర్‌ను నిర్మించుకోగల సమర్థుడైన నాయకుడు కావాలి. కేవలం పారాచూట్ అభ్యర్థులతోనో, అప్పటికప్పుడు ఇచ్చే హామీలతోనో దశాబ్దాల అనుబంధాన్ని తెంచడం అసాధ్యం అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే... రేవంత్ రెడ్డి వ్యూహం సాధ్యమవుతుందా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల వంటి సెగ్మెంట్లను లక్ష్యంగా చేసుకుని అక్కడ రాజకీయ శూన్యతను నింపాలని చూస్తున్నారు. రాజకీయంలో ఏదైనా సాధ్యమే కానీ, అది అషామాషీగా జరగదు. సిద్దిపేట వంటి చోట్ల మార్పు రావాలంటే అది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోకుండా, క్షేత్రస్థాయిలో బలం పెంచుకోకుండా చేసే ప్రకటనలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతాయి. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించాలంటే, అక్కడ హరీష్ రావు స్థాయికి దీటుగా పనిచేసే నాయకత్వాన్ని ముందుగా తయారు చేసుకోవాలన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :