ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల ను పురస్కరించుకొని మంచిర్యాల డిసిపి ఆధ్వర్యంలో శనివారం మేఘా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ శిబిరంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ల పరిధిలో సిసిసి నుండి మొదలుకొని జన్నారం వరకు సిఐలు ఎస్ఐలు పోలీసు బృందాలు రక్తదాన దానం చేశారు.175 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి, మంచిర్యాల ఏసిపి మంచిర్యాల, సిసిసి సిఐ లక్షెట్టిపేట సిఐ జన్నారం సిఐ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ మహేందర్, ట్రెజరర్ సత్యపాల్, జిల్లా ఎంసీ మెంబర్ శంకర్ వర్మ, కాసర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు.
Admin
E Nivas News