ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని గతంలో ప్రయత్నించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందినిపై ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. విశ్రాంత ఉద్యోగుల బకాయిల విడుదలకు ఆమె కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అంబర్ పేట న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు చేశారు. దీనిపై పకడ్బందీగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. నందిని రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నారని, అయితే గతంలో ఎంపీ టికెట్ ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఇంకా బాధితులు బయటికి రానున్నట్లు తెలిసింది.
Admin
E Nivas News