Thursday, 15 January 2026 05:42:30 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి...

పలుకేసుల్లో స్వాధీనం చేసుకున్న 241 కిలోలు 956 గ్రాముల గంజాయి, 226 గ్రాముల హషీష్ దగ్ధం..

Date : 13 January 2026 10:21 PM Views : 17

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎస్పి డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ చట్టం కింద ఉన్న కేసులకు సంబంధించిన గంజాయి, హషీష్‌ను మంగళవారం దగ్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి న్యాయస్థాన అనుమతితో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం ఒక కోటి ఇరవై ఒక లక్షల యాభై ఆరు వేల ఐదు వందలు రూపాయల విలువ గల 241 కిలోలు 956 గ్రాముల గంజాయి, 226 గ్రాముల హషీష్ ను నిబంధనల ప్రకారం దగ్ధం చేయడం జరిగిందన్నారు. మహబూబాబాద్ టౌన్, డోర్నకల్, కెసముద్రం, కురవి, గూడూరు, గర్ల, మరిపెడ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించిన మాదక ద్రవ్యాలను వరంగల్ కాకతీయ మెడి వేస్ట్ యూనిట్ లో ప్రత్యేక యంత్రాల ద్వారా పూర్తిగా దగ్ధంచేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :