Monday, 14 September 2026 07:14:13 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ మీద ఉన్న ధ్యాస విద్యా వ్యవస్థ పై లేదు

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథ్

Date : 22 October 2025 08:06 PM Views : 295

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ మీద ఉన్న ధ్యాస విద్యా వ్యవస్థపై లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ విమర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బాలుర సోషల్ వెల్ఫేర్ హాస్టల్ (లక్షెట్టిపేట) వార్డెన్ బాలాసంకుల రాజ్ గోపాల్ రావు కి గత నాలుగు నెలలుగా ప్రభుత్వం నుండి రావాల్సిన 8 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులు రాక మరియు ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతో వారి నివాసం లో మూడు రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ మరియు స్థానిక బీజేపీ నాయకులు వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు. బిల్లులు రాక ఆర్ధిక ఇబ్బందులు భరించలేక చివరికి తల్లి గాజులు అమ్మ వలసిన పరిస్థితుల్లో రాజ్ గోపాల్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారనిరఘునాథ్ తెలిపారు . విద్యా శాఖ మంత్రి గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకంకూడా దయనీయ పరిస్థితుల్లో ఉందన్నారు . ఏప్రిల్ 2025 నుండి ఇప్పటి వరకు గుడ్ల బిల్లులు చెల్లించ లేదన్నారు. అంతేకాకుండా గత మూడు నెలల మధ్యాహ్న భోజన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా రంగం క్రమంగా కుప్పకూలే దశకు చేరిందన్నారు . ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు దాటినా, ఇప్పటివరకు పాఠశాల నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. ఈ కారణంగా పాఠశాలలలో చాక్ పీసులు, డస్టర్స్, అవసరమైన సామగ్రి కొనుగోలు, చిన్న చిన్న మరమ్మత్తులు, కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయే ప్రధానోపాధ్యాయులు వారి జేబుల నుండి చెల్లించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు రాక వార్డెన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అటు రిటైర్డ్ ఉపాధ్యాయులు మరియు జీపీఎఫ్ రాక టీచర్స్ ఇబ్బందులు పడుతున్నారన్నారు . విద్యా మరియు సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :