ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ములుగు జిల్లామేడారం మహా కుంభమేళ జాతరలో ఇప్పపువ్వు లడ్డూను భక్తులు ఇష్టపడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరలో ఈసారి ఇప్పపువ్వు లడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిరిజన మహిళా సంఘం సభ్యులు తయారు చేసిన ఈ పోషక విలువలున్న లడ్లను జనవరి 13న మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు రూ.3 లక్షల వ్యాపారం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. మేడారం పరిసరాలలో 10 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక బాక్స్ (250 గ్రాములు) రూ.150కు లభిస్తోంది. ఇప్ప పువ్వు లడ్డు కొనుగోలు వేలాదిమంది చేస్తున్నారు.
Admin
E Nivas News