ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల లోను రాణించాలని స్థానిక ఎంఈఓ శైలజ అన్నారు. శనివారం స్థానిక జెడ్పీఎస్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్14 సంవత్సరాల విద్యార్థినిలు క్రీడల పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూజిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి ఈనెల 24, 25, 26 వ తేదీలలో పెద్దపల్లి జిల్లా ధర్మారంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారని తెలిపారు . ఇక్కడ గెలుపొందిన విద్యార్థులను రాష్ట్రస్థాయిక ఎంపిక చేస్తామన్నారు. ఈ పోటీలు ఎస్ జి ఎఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిడి రామ్మోహన్, ఎస్డీఎఫ్ కార్యదర్శి వెంకటేశం, ఉపాధ్యాయులు రాజా, కొంజర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News