ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మున్సిపాలిటీలోని 8వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లైశెట్టి రజిత-రాజును భారీ మెజార్టీతో గెలిపించాలని సింగిల్ విండో మాజీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఓటర్లను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంథని పురపాలక సంఘం పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ నాయకులతో కలిసి కొత్త శ్రీనివాస్ గడప గడపకు తిరిగి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, రెండు లక్షల రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు 2 లక్షలు వడ్డీ లేని రుణాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే నాయకత్వం లైశెట్టి రజిత-రాజుకు ఉందన్నారు. ఆమె విజయం సాధించేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. లైశెట్టి రజిత-రాజు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు ప్రజలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
Admin
E Nivas News