ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పోతరవేని క్రాంతి ని సన్మానించిన నూతన సభ్యులు మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పోతరవేని క్రాంతి ఆధ్వర్యంలో 32 మంది నూతన మత్స్య కార్మికులకు సభ్యత్వాలు, గుర్తింపు కార్డులను పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య, పెద్దపల్లి జిల్లా అధికారి నరేష్ నాయుడు చేతుల మీదుగా బోయిన్ పేట్ లక్ష్మిదేవర దేవాలయం ప్రాంగణంలో అందజేశారు. అనంతరం నూతన సభ్యత్వాల గురించి రెండు సంవత్సరాలలో పెద్దపల్లి జిల్లాలో మొదటి సారి సభ్యత్వాలు అందేలా కృషి చేసిన పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ మంథని అధ్యక్షులు పోతరవేని క్రాంతిని సన్మానించిన నూతన సభ్యత్వాలు అందుకున్న మత్స్యకార్మికులు ఈ కార్యక్రమంలో మంథని మాజీ అధ్యకులు పోతరవేని లక్ష్మిరాజం, మంథని డైరెక్టర్లు కుంట బద్రి, సిలివేరి భూమన్న, బయ్యా రాజేష్, అధిక సంఖ్యలో మత్స్య కార్మికులు పాల్గొన్నారు.
Admin
E Nivas News