ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎన్నికల్లో ఓడిన గెలిచిన ప్రజలతోనే కలిసిమెలిసి ఉంటానని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనేప్ప స్పష్టం చేశారు. సోమవారంకొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా బారేగుడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. ఈ సందర్భంగా బారేగుడ గ్రామస్థులతో యువకులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గ్రామస్థులను పలువురినిఆప్యాయంగా అనురాఘంగా పలకరించారు. తన కుటుంబమంతా ప్రజాసేవలో భాగస్వాములవుతూ ప్రజలతోనే ఉంటున్నామని ఆయన అన్నారు. నిత్య అన్నదాన సత్రంలో ప్రతిరోజూ ప్రజలకు రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. మీరు నాకు సిర్పూర్ నియోజక వర్గంలో మూడు సార్లు ఆశీర్వదించి అవకాశమిచ్చారు అని మీ మేలు ఎప్పటికీ మార్చి పోను అని తెలిపారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు సిర్పూర్ నియోజక వర్గ ప్రజలకు అండగా ఉంటానని ఆయన అన్నారు.ఈ కారిక్రమంలో నాయకులు రాజన్న అబ్దుల్ రసీద్ సందీప్ జమ్నాజి దేవిధాస్ ధనుంజయ్ ఎర్రన్న గణపతి బాపురావు శ్రీనివాస్ వెంకటేశ్ కిరణ్ మరియు గ్రామస్థులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News