ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఖోడాద్ గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో, రూ. 34 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ఖోడాద్ గ్రామ ప్రజలు వర్షాకాలంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశామని తెలిపారు. బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలతో పాటు రైతులు, విద్యార్థులు సురక్షితంగా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News