ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు, గోనె సంచులు, తేమ యంత్రాలు, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు. దొడ్డు రకం, సన్న రకం ధాన్యాలను వేరువేరుగా కొనుగోలు చేయాలని, సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు సమయంలో రైతుల వివరాలు, ధాన్యం వివరాలను సేకరించి ట్యాబ్ లలో నమోదు చేయాలని, సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Admin
E Nivas News