ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎన్నికల మెని ఫెస్టొలొ పొందుపరిచిన విధంగా తెలంగాణ ఉద్యమకారుల హామీలను వెంటనె అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతి పత్రం సమర్పించారు. అలాగే పెద్దపల్లి జిల్లా డి సీసీ అధ్యక్షులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్, ఎమ్మెల్యేఎ విజయ రామ రావు లకు పెద్దపెల్లి స్వరూప గార్డెన్లో వినతిపత్రం సమర్పించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకార్ల పొరం రాష్ట్ర మైహిళ విభాగం అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి, తెలంగాణ తొలి మలి చివరి దశ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం ముదిరాజ్, ఉత్తర తెలంగాణ కన్వీనర్ బత్తుల శంకర్ తదితరులు పాల్గొని తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రిని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అంచలంచలుగా ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
Admin
E Nivas News