ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి : ముత్తారం మండలానికి చెందిన 45 సంవత్సరాల మహిళ తీవ్రమైన కడుపు నొప్పి మరియు తీవ్ర రక్తస్రావం తో బాధ పడుతూ ముత్తారం మాజీ జెడ్పీటీసీని సంప్రదించగా ఆయన ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు విషయం తెలియగా మంత్రి సూచనల మేరకు సదరు పేషెంట్ ను డా శ్రీధర్ DCHS పెద్దపల్లి మాతాశిశు ఆసుపత్రి లో అడ్మిట్ చేశారు. ఈ పేషెంట్ కి గర్భకోశంలో ప్రాబ్లం ఉందని గుర్తించి, అవసరం ఉన్న పరీక్షలు అన్ని నిర్వహించారు. ఈ పేషెంట్ 103 కిలోల బరువు కలిగి ఉంది, ఇది చాలా కష్టతరమైన ఆపరేషన్ అయిన కూడా అత్యంత నైపుణ్యం, అనుభవం ఉన్న డా. బి. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి పిలిపించి గురువారం ఆ మహిళకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. హైరిస్క్ ఆపరేషన్స్ నిర్వహించడంలో ముందున్న వైద్యులను, ఆసుపత్రి సూపరింటెండెంట్ ను జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష అభినందించారు. అలాగే పెద్దపల్లి ఆసుపత్రిలో అందుతున్న సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఒక ప్రకటన లో తెలిపారు
Admin
E Nivas News