ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఇటీవల మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు క్రికెట్ కిట్ అందించాలని ఎంపీ ని కోరారు.విద్యార్థుల అభ్యర్థనపై వెంటనే స్పందించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ వారి కోరికను నెరవేర్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన కృషితో మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు సోమవారం క్రికెట్ కిట్ అందజేశారు.యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, విద్యార్థులకు అవసరమైన క్రీడా సదుపాయాలను కల్పించేందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని పలువురు అభినందించారు. విద్యార్థుల అభివృద్ధితో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ వారి ప్రతిభను వెలికితీసేందుకు ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. క్రికెట్ కిట్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ గ, మంత్రి వివేక్ వెంకటస్వామికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News