Sunday, 13 September 2026 11:59:13 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రైతులకు భరోసానిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే...

సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

Date : 19 November 2025 06:12 PM Views : 350

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతులకు భరోసానిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని మల్లారం, వెంకటాపూర్, నాగెపల్లి, భట్టుపల్లి వరి ధాన్యం కేంద్రాలను ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆరెంద, స్వర్ణపల్లి, అడవిసోమన్ పల్లి, చిల్లపల్లి, మల్లేపల్లి, పోతారం, సిరిపురం కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ నాయకులు, రైతులు, హమలిలతో కలిసి ప్రారoభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని, రైతుకు మద్దతు ధరతో పాటు క్విoటాల్ కు రూ.500 బోనస్ ప్రభుత్వం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుందని అన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు దళారుల బారినపడి మోసపోకుండా ఉండేందుకు, ధాన్యం అమ్ముకోవడానికి వెళ్లే దూర భారాన్ని తగ్గించేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలోనే అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి, ప్రస్తుత ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఊరూర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించడం జరిగిందని అన్నారు. ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం తాలు, తప్ప పేరిట వరి ధాన్యంలో కోత విధించేదని, కాంగ్రెస్ ప్రభుత్వం లో ఒక్క గింజ కూడా కటింగ్ లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రైతులకు రైతు భరోసా, రూ.2లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్లు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాపు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిముర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి,కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, దేవల్ల విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, మాజీ ఎంపిపి కొండ శంకర్, ఏఎంసి మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు బూడిద శంకర్, ఊట్ల అనిల్, ఎరుకల ప్రవీణ్, అక్కపాక సంపత్, బిబ్బర కిషన్, తాళ్ల సత్యనారాయణ, గుమ్మడి రాజయ్య, రాజేంద్ర ప్రసాద్ తిరుపతి రెడ్డి, మానేం రాజేందర్, సత్యనారాయణ, జక్కు బాపు, చాట్లపల్లి శ్రీనివాస్, పందిళ్ళ నర్సయ్య, కాసిపేట వెంకటస్వామి, పొట్ల రవి, గూడ సత్యనారాయణ, గూడ మల్లారెడ్డి, కొండ మహేందర్, దబ్బేట శ్రీశైలం, మండపు మధు, కొటారి బాపు, కుంభం సమ్మిరెడ్డి, కనవేన కిష్టస్వామి, అప్పాల కుమార్, గట్టు శివ శంకర్, కుడుదుల మహాదేవ్, రవికుమార్, ఎరుకల రవి, శశికళ, ఎడ్ల ప్రమీల, కారెంగుల తిరుపతి, ఇసంపల్లి సత్యనారాయణ, తమ్మిశెట్టి సదయ్య, ఆత్కూరి రాజేశం,అనిల్, సాగర్,రాజేందర్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, నాయకులు, కార్యకర్తలు, రైతులు, హమాలీలు, మహిళలు, ఐకెపి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :