ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్ కానీ అనమలిస్ జాబితాలో ఓటర్లకు జారీచేసిననోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో నోటీసుల జారీ, విచారణ ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియ నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో ఓటర్లకు అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిట్టపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఈ క్రమంలో పాఠశాలలో విద్యార్థులకుఅవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలని, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు . ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నసౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు. ఆసరా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి మండల పరిషత్ అభివృద్ధి అధికారి లాగిన్ నుండి ప్రక్రియనిర్వహించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆహారం నాణ్యతను పరిశీలించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Admin
E Nivas News