Tuesday, 28 July 2026 07:20:26 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ)

Date : 29 March 2026 12:42 AM Views : 105

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) రాష్ట్ర అధ్యక్షుడు డా . కడారు సురేందర్ రెడ్డి సూచనతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) 2026 సంవత్సరం డైరీ, క్యాలెండర్, తెలంగాణ ప్రభుత్వ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ అసోసియేషన్ డైరీ లను శనివారం ఆవిష్కరించారు. లక్షెట్టిపేటలో కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మరియు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) జోనల్ సెక్రటరీ జాడి శంకరయ్య, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డా. తన్నీరు సురేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట అధ్యాపకులు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) సభ్యులు తిరుపతి, ప్రేమలత, నాగేశ్వర్ సంతోష్ కుమార్ చేతుల మీదుగా, మంచిర్యాలలో సంఘం బాధ్యులు డా.గోపాల కృష్ణ చేతుల మీదుగా రెండు సంఘాల డైరీ క్యాలెండర్ లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాలకు చెందిన అధ్యాపకులు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జోనల్ సెక్రటరీ జాడి శంకరయ్య, అధ్యక్షుడు సురేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను అలాగే కళాశాలల్లో చదివే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) నిశితంగా కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్ర అధ్యక్షుడు మరియు తెలంగాణ ప్రభుత్వ కళాశాలల సంఘాల జెఏసి అధ్యక్షుడు డా. కడారు సురేందర్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల ప్రయోజనాలు పొందడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. కళాశాలల ప్రగతి తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.విద్యార్థులు అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు ప్రభుత్వ కళాశాలలకు చెందిన విషయాలను సురేందర్ రెడ్డి దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధ్యాపకుల సర్వీసు సమస్యల కోసం పోరాడుతున్న టి జి సి జి టి ఏ రాష్ట్ర కార్యవర్గానికి ఈ సందర్భంగా లక్షెట్టిపేట, మంచిర్యాల కళాశాలల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: