ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) రాష్ట్ర అధ్యక్షుడు డా . కడారు సురేందర్ రెడ్డి సూచనతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) 2026 సంవత్సరం డైరీ, క్యాలెండర్, తెలంగాణ ప్రభుత్వ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ అసోసియేషన్ డైరీ లను శనివారం ఆవిష్కరించారు. లక్షెట్టిపేటలో కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మరియు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) జోనల్ సెక్రటరీ జాడి శంకరయ్య, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డా. తన్నీరు సురేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట అధ్యాపకులు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) సభ్యులు తిరుపతి, ప్రేమలత, నాగేశ్వర్ సంతోష్ కుమార్ చేతుల మీదుగా, మంచిర్యాలలో సంఘం బాధ్యులు డా.గోపాల కృష్ణ చేతుల మీదుగా రెండు సంఘాల డైరీ క్యాలెండర్ లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాలకు చెందిన అధ్యాపకులు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జోనల్ సెక్రటరీ జాడి శంకరయ్య, అధ్యక్షుడు సురేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను అలాగే కళాశాలల్లో చదివే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) నిశితంగా కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్ర అధ్యక్షుడు మరియు తెలంగాణ ప్రభుత్వ కళాశాలల సంఘాల జెఏసి అధ్యక్షుడు డా. కడారు సురేందర్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల ప్రయోజనాలు పొందడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. కళాశాలల ప్రగతి తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.విద్యార్థులు అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు ప్రభుత్వ కళాశాలలకు చెందిన విషయాలను సురేందర్ రెడ్డి దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధ్యాపకుల సర్వీసు సమస్యల కోసం పోరాడుతున్న టి జి సి జి టి ఏ రాష్ట్ర కార్యవర్గానికి ఈ సందర్భంగా లక్షెట్టిపేట, మంచిర్యాల కళాశాలల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News