Monday, 14 September 2026 03:52:42 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

చట్టం ముందు అందరూ సమానమే... సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగుస్తున్న ఉచ్చు...

Date : 11 May 2026 08:55 PM Views : 130

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితీవ్రంగా స్పందిం చారు. ఫోక్సోకేసు పై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ అధికారులను ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేంద్రమంత్రి కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తేదీనే బాధితురాలి తల్లి నుంచి ఫిర్యాదు అందినప్పటికీ, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ కేసులో తాత్సారం చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చట్టం ముందు అందరూ సమానమే నని, ఇలాంటి సున్ని తమైన కేసుల్లో నిర్ల క్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ముఖ్య మంత్రి ప్రశ్నలకు స్పందించిన డీజీపీ, గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నమై ఉందని వివరించారు. భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది అందరూ ఆ విధుల్లో బిజీగా ఉండటం వల్లే ప్రాథమిక విచారణలో కొంత జాప్యం జరిగిందని తెలిపారు. అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశామని, పూర్తి వివరాలను సేకరిస్తున్నామని సీఎంకు నివేదించారు. *ప్రత్యేక బృందాల ఏర్పాటు* ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించాలని రేవంత్ రెడ్డి, ఆదేశించినట్లు తెలుస్తుంది, బాధిత బాలికకు న్యాయం జరిగేలా చూడాలని, ఇందు కోసం ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో సాక్ష్యాలను సేకరించి, నివేదికను త్వరగా సమర్పించా లని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగాలని స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: