ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మాదిగ హక్కుల సాధనకై ఎంఆర్పీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు కళ్లేపల్లి విక్రమ్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో ఆ సంఘం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూమాదిగ జాతి జాగృతికి ఎంఆర్పీఎస్ పోరాటం చేసి ఎస్సీ రిజర్వేషన్ సాధించమన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో వర్గీకరణ అమలు కోసం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అవునూరి లచ్చన్న, చాతరాజు రాజన్న, గోల్కొండ సత్తయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్లూరి శివ కుమార్, మాజీ కౌన్సిలర్ ఒరగంటి శ్రీకాంత్, అడ్లూరి దేవేందర్, దర్శనాల నవీన్ కుమార్, తోటపల్లి సత్యం, మేకల బానేష్, సుంచు రమేష్, మేకల బానేష్, తగరపు గంగన్న, కళ్లేపల్లి రవి, మేకల దిలీప్, కముటం లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News