ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు డిగ్రీలో చేరడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ పేరుతో షెడ్యుల్ విడుదల చేసింది. విద్యార్థుల సౌకర్యం కోసం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ డెస్క్ ని ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ సోమవారం ప్రారంభించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ కోసం ఏమైనా సందేహాలు ఉంటే ఈ హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని, డిగ్రీలో చేరడానికి అన్ని రకాల సమాచారాన్ని దోస్త్ హెల్ప్ డెస్క్ ద్వారా పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు హెల్ప్ డెస్క్ ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేరుగా సంప్రదించ వచ్చని లేదా ఇంటి నుండే హెల్ప్ డెస్క్ ఇంచార్జీ శ్రీనివాస్ గారిని 80089 48148 ఫోన్ నంబర్లో సంప్రదించి తగిన సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రం లో ఎక్కడి నుండైనా డిగ్రీ అడ్మిషన్ పొందడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగించు కోవచ్చని తెలిపారు. దోస్త్ ద్వారా అడ్మిషన్ లలో పారదర్శకత లభిస్తుందని తెలిపారు. దోస్త్ రిజిస్ట్రేషన్ లేకపోతే డిగ్రీ అడ్మిషన్ కు అర్హులు కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు శంకరయ్య, శ్రీనివాస్, సంధ్యారాణి, కవిత, స్వప్న, మహేష్, సతీష్ బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News