ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గంపలపల్లికి చెందిన రామ్ దేని రాకేష్ (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే గంపలపల్లి గ్రామానికి చెందిన రాకేష్ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి గత ఏడాది ఇదే గ్రామంలో ఉండే మేన మరదలు కావ్యతో వివాహమైంది. మృతునికి ఆదివారం ఉదయం ఇంట్లో తన భార్యతో చిన్న గొడవ జరగడంతో తన భార్య వాళ్ళ తండ్రిని పిలిపించుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్య చిన్నపాటి గొడవకి తండ్రిని పిలిపించుకొని వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాకేష్ ఇంట్లో ఉన్న పంటకు కొట్టే గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఇంట్లో ఉన్న తన తమ్ముడు రాకేష్ ను లక్షెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Admin
E Nivas News