ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు వరమని బూత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ తెలిపారు. గురువారం నిర్మల్ జిల్లానెరడిగొండ మండల కేంద్రంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా పేదింటి బిడ్డకు ఆసరాగా నిలవాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలను ప్రారంభించారన్నారు. ఇప్పుడున్న అధికార కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలతో పాటు ఇస్తామన్న తులం బంగారం సైతం ఇచ్చి హామీ నెరవేర్చుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ పండరీ, జహీర్, పీఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్, అనిల్ జాదవ్ యువసేన అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు శ్రీకాంత్, కృష్ణా, గంగాధర్, నాయకులు రాథోడ్ సురేందర్, కార్యకర్తలుపాల్గొన్నారు.
Admin
E Nivas News