Wednesday, 29 July 2026 08:12:36 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఆర్టికల్ 14 కు వాలిడేషన్ 2025 పూర్తిగా వ్యతిరేకం...

విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజమల్లయ్య..

Date : 25 March 2026 10:04 PM Views : 138

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆర్టికల్ 14 కు వాలిడేషన్ ఆక్ట్2025 పూర్తిగా వ్యతిరేకంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహారించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షులు నేరెళ్ల రాజ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పని మధుసూదన్ కోరారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాలిడేషన్ యాక్ట్ 2025 విశ్రాంత ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఈ చట్టం వలన 2026, జనవరికి ముందు రిటైర్ అయినా వారికి పెన్షన్ లో ఎలాంటి పెరుగుదల ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026, జనవరి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారికి మాత్రమే పీ ఆర్ సీ, డీ ఆర్ లతో పాటు ఇతర బెనిఫిట్స్ వర్తిస్తాయనడం అన్యాయమన్నారు. ఈ చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ -14 కు పూర్తి వ్యతిరేకమని తెలిపారు.చట్టం ముందు అందరూ సమానులే అని స్పష్టంగా ఉన్నప్పటికీ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెరుగుదల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి శోచనీయమన్నారు. 1979 లో రిటైర్డ్ ఎంప్లాయిస్ పెన్షన్స్ పెరుగుదలకు వ్యతిరేకంగా వచ్చిన ఆదేశాలపై డీ ఎస్ నాకర ఆధ్వర్యంలో భారత అత్యున్నత న్యాయస్థానంను ఆశ్రయించగా, అప్పటి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తో కూడిన 5 గురు సభ్యుల బెంచ్ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు పెన్షన్స్ లో ఎలాంటి వివక్షత చూపరాదని, చట్టం ముందు అందరూ సమానం కాబట్టి పెన్షనర్స్ కు కాలనుగుణంగా పెరుగుదల ఉండాలని తీర్పునిచ్చిందన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ సేవలకు చెల్లించే మూల్యంపైన కేంద్ర ప్రభుత్వం వివక్షతను విడనాడాలని వెంటనే వాలిడేషన్ యాక్ట్ 2025 ను ఉపసంహారించాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్ అనేది ఎవరి దయ,దాక్షిణ్యల మీద ఇచ్చేది కాదని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైన తమ వైఖరి మార్చుకుని పెన్షనర్స్ కు న్యాయం చేయాలని కోరారు. లేనిచో రాష్ట్ర కమిటీ ఆదేశాలతో మరిన్ని నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఎన్నో ఏండ్లు ప్రభుత్వానికి అనేక రకాలుగా సేవలు అందిస్తే, ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయిస్ కు అన్యాయం చేయడం కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. అంతకుముందు తహసీల్దార్ దిలీప్ కుమార్ కు పెన్షనర్స్ సమస్య పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షులు నేరెళ్ల రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పని మధుసూదన్, కోశాధికారి రాచర్ల సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు జంగం ఆశయ్య, ఉపాధ్యక్షులు దేవేంద్ర విజయుడు, అమీర్ సుల్తాన, జాయింట్ సెక్రటరీ కొట్టె రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నం సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి కొండపర్తి సత్యనారాయణ, సభ్యులు సత్యనారాయణ,పెట్టెం మల్లయ్య, గడ్డం లింగయ్య, కోడి సంపూర్ణ, నూతి శంకరయ్య, మేడి బాలరాజు,వొజ్జల మనోహర్, ప్రతాప్, వేల్పుల లింగం ( సాగర్ ) తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :