Tuesday, 15 September 2026 07:21:01 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఆర్టికల్ 14 కు వాలిడేషన్ 2025 పూర్తిగా వ్యతిరేకం...

విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజమల్లయ్య..

Date : 25 March 2026 10:04 PM Views : 194

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆర్టికల్ 14 కు వాలిడేషన్ ఆక్ట్2025 పూర్తిగా వ్యతిరేకంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహారించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షులు నేరెళ్ల రాజ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పని మధుసూదన్ కోరారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాలిడేషన్ యాక్ట్ 2025 విశ్రాంత ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఈ చట్టం వలన 2026, జనవరికి ముందు రిటైర్ అయినా వారికి పెన్షన్ లో ఎలాంటి పెరుగుదల ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026, జనవరి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారికి మాత్రమే పీ ఆర్ సీ, డీ ఆర్ లతో పాటు ఇతర బెనిఫిట్స్ వర్తిస్తాయనడం అన్యాయమన్నారు. ఈ చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ -14 కు పూర్తి వ్యతిరేకమని తెలిపారు.చట్టం ముందు అందరూ సమానులే అని స్పష్టంగా ఉన్నప్పటికీ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెరుగుదల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి శోచనీయమన్నారు. 1979 లో రిటైర్డ్ ఎంప్లాయిస్ పెన్షన్స్ పెరుగుదలకు వ్యతిరేకంగా వచ్చిన ఆదేశాలపై డీ ఎస్ నాకర ఆధ్వర్యంలో భారత అత్యున్నత న్యాయస్థానంను ఆశ్రయించగా, అప్పటి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తో కూడిన 5 గురు సభ్యుల బెంచ్ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు పెన్షన్స్ లో ఎలాంటి వివక్షత చూపరాదని, చట్టం ముందు అందరూ సమానం కాబట్టి పెన్షనర్స్ కు కాలనుగుణంగా పెరుగుదల ఉండాలని తీర్పునిచ్చిందన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ సేవలకు చెల్లించే మూల్యంపైన కేంద్ర ప్రభుత్వం వివక్షతను విడనాడాలని వెంటనే వాలిడేషన్ యాక్ట్ 2025 ను ఉపసంహారించాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్ అనేది ఎవరి దయ,దాక్షిణ్యల మీద ఇచ్చేది కాదని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైన తమ వైఖరి మార్చుకుని పెన్షనర్స్ కు న్యాయం చేయాలని కోరారు. లేనిచో రాష్ట్ర కమిటీ ఆదేశాలతో మరిన్ని నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఎన్నో ఏండ్లు ప్రభుత్వానికి అనేక రకాలుగా సేవలు అందిస్తే, ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయిస్ కు అన్యాయం చేయడం కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. అంతకుముందు తహసీల్దార్ దిలీప్ కుమార్ కు పెన్షనర్స్ సమస్య పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షులు నేరెళ్ల రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పని మధుసూదన్, కోశాధికారి రాచర్ల సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు జంగం ఆశయ్య, ఉపాధ్యక్షులు దేవేంద్ర విజయుడు, అమీర్ సుల్తాన, జాయింట్ సెక్రటరీ కొట్టె రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నం సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి కొండపర్తి సత్యనారాయణ, సభ్యులు సత్యనారాయణ,పెట్టెం మల్లయ్య, గడ్డం లింగయ్య, కోడి సంపూర్ణ, నూతి శంకరయ్య, మేడి బాలరాజు,వొజ్జల మనోహర్, ప్రతాప్, వేల్పుల లింగం ( సాగర్ ) తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: