ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాజ్యాంగ నిబంధన, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం, జనాభా ప్రాతిపదికన ప్రకారం ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్ వారి జనాభా సంఖ్య కంటే తక్కువగా ఉండకూడదని, అదే విధంగా మొత్తం రిజర్వేషన్స్ 50 శాతానికి మించకూడదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలు 2025 సందర్భంలో బి.సి. డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా జిల్లాలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పునః పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 306 గ్రామపంచాయతీలు, 2 వేల 680 వార్డు సభ్యుల స్థానాలకు ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న నియమావళి ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ పునః పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. భీమారం మండలంలో ఎస్.సి. 30.2 శాతం, ఎస్.టి. 20.15 శాతం (మొత్తం 50.35 శాతం) బి.సి. 0, కాసిపేట మండలంలో ఎస్.సి. 21.06 శాతం, ఎస్.టి. 29.40 శాతం (మొత్తం 50.46 శాతం), బి.సి. 0, కోటపల్లి మండలంలో ఎస్.సి. 37.77 శాతం, ఎస్.టి. 9.63 శాతం (మొత్తం 47.4 శాతం) , బి.సి. 0, మందమర్రి మండలంలో ఎస్.సి. 33.41 శాతం, ఎస్.టి. 16.39 శాతం (మొత్తం 49.8 శాతం), బి.సి. 0, నెన్నెల మండలంలో ఎస్.సి. 29.96 శాతం, ఎస్.టి. 15.20 శాతం (మొత్తం 45.16 శాతం), బి.సి. 0, ప్రకారంగా నమూనా రిజర్వేషన్లలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు కేటాయించినట్లయితే నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ దాటుతుందని, ఈ కారణంగా వెనుకబడిన తరగతులకు (బి.సి.లకు) రిజర్వేషన్ల కేటాయింపు జరగడం లేదని తెలిపారు. తదుపరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Admin
E Nivas News