ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని శనివారం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ వినతిపత్రం అందజేశారు . శనివారం జిల్లా తుడుందెబ్బ నాయకుల బృందంతో కలిసి ఆయన ఐటీడీఏ పీవో మంద మకరందుని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల సమస్యలు, పాఠశాలల దుస్థితిపై పీవోకు వినతి పత్రం సమర్పించి,సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బనాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మెరుగైన విద్యా ప్రమాణాలు ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల సమస్యలను క్లుప్తంగా వివరించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని కోరారు.కనీస సౌకర్యాల కల్పనహాస్టళ్లు, పాఠశాలల్లో తాగునీరు, పరిశుభ్రత, తదితర కనీస వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.ప్రతిభకు ప్రోత్సాహం గిరిజన విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను, ప్రతిభను గుర్తించి వారిని ప్రభుత్వ పరంగా ఉన్నతంగా ప్రోత్సహించాలన్నారు. ఆదివాసీ సమస్యల పరిష్కారం విద్యా రంగంతో పాటు ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఇతర సామాజిక, ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని పీవోను కోరారు. దీనిపై ఐటీడీఏ పీవో సానుకూలంగా స్పందిస్తూసమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందేబ్బ జిల్లా సలహాదారు కనక ప్రభాకర్, టైగర్ సేనా జిల్లా ప్రధాన కార్యదర్శి మడవి పురుషోత్తం, సోనాపూర్ సర్పంచ్ & తుడుందెబ్బ వాంకిడి మండల ప్రధాన కార్యదర్శి పంద్రం సురేష్, తుడుందేబ్బ వాంకిడి మండల ఉపాధ్యక్షులు సోయం సంజీవ్, దుబ్బగూడ సర్పంచ్ కోవ మోతిరాం, తుడుందేబ్బ కేరామెరి మండల కార్యదర్శి అడ చిన్నూ, ప్రముఖ నాయకులు అడ సోమేష్, మడవి జ్యోతిరాం, కోవ శ్యాంరావు, ఆత్రం మారుతీ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News