ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వైజ్, పార్టీ టైం వర్కర్లకు గత 4 నెలలుగా వేతనాలు రావడం లేదని సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం గిరిజన డిప్యూటీ ఇన్చార్జి డైరెక్టర్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ అదే విదంగా జిల్లాలోని కొన్ని హాస్టలల్లో విద్యాదన్ సంస్థ నిర్వాహకులు న్యూట్రి గార్డెన్ పేరుతో కూరగాయలు పెంచడానికి హాస్టల్స్ ప్రాంగణంలో నేలను చదును చేసి వర్కర్లను పెట్టి పనులు చేయిస్తున్నారని, గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ ద్వారా ఈ స్వచ్చంద సంస్థకు అనుమతుల విషయం గురించి ఐటీడీఏ గిరిజన శాఖ అధికారులతో మాట్లాడితే దీనిపై పూర్తి సమాచారం మాకు తెలియదని అనడం జరుగుతుందన్నారు. గిరిజన శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేనిది స్వచ్ఛంద సంస్థ యొక్క సేవలను సంక్షేమ హాస్టల్లో చేయనివ్వద్దు. ఇప్పటికైన జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారులు స్పందించి స్వచ్చంద సంస్థల సేవలపై వాటి అనుమతులపై తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మౌలాలి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు , మహేందర్ సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News